Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సంక్రాంతి వేళ దక్షిణ భారతదేశంలో విమాన టిక్కెట్లు బుకింగ్‌: అత్యున్నత గమ్యస్థానంగా నిలిచిన విశాఖపట్నం

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (20:35 IST)
సంక్రాంతి పండుగ వేళ, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీఏ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన, క్లియర్‌ట్రిప్‌ విమాన బుకింగ్స్‌ పరంగా అత్యధిక వృద్ధిని జనవరి 2023లో విశాఖపట్నం నగరం చూసింది. దక్షిణ భారతదేశంలో అత్యధిక టిక్కెట్ల బుకింగ్స్‌ ఈ నగరానికి జరిగాయి. ఆఫ్‌ సీజన్‌గా భావించే నవంబర్‌ 2022తో పోలిస్తే బెంగళూరు నుంచి విశాఖపట్నంకు ఈ టిక్కెట్ల బుకింగ్‌పరంగా 130% వృద్ధి కనిపించింది. ఇదే రీతిలో న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నంకు టిక్కెట్ల బుకింగ్‌ పరంగా 87% వృద్ధి నమోదైతే, కోల్‌కతా నుంచి 48%, చెన్నై నుంచి 33% వృద్ధి బుకింగ్స్‌ పరంగా కనిపించింది.
 
క్లియర్‌ట్రిప్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రహ్లాద్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘‘ అత్యంత అందమైన బీచ్‌లు, బొర్రా గుహలు లాంటి వినూత్నమైన ఆకర్షణలకు తోడు సబ్‌మెరైన్‌ మ్యూజియం వంటి ఆకర్షణలతో ఈ నౌకానగరం అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతంగా సంవత్సరమంతా యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అయితే, సంక్రాంతి వేళ, సంప్రదాయ పండుగులు, విభిన్నమైన రుచులు, తారాస్ధాయికి చేరిన ఉత్సాహానికి కేంద్రంగా వైజాగ్‌ మారిపోతుంది. తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలలో పాల్గొనడానికి లేదంటే మొట్టమొదటిసారిగా ఈ మెట్రోపాలిస్‌ నగరాన్ని అన్వేషించడం కోసం ఈ నగరానికి చాలామంది వెళ్తుంటారు. ఈ పండుగ సీజన్‌ సమయంలో వారికి ఆనందానుభూతులను కల్పిస్తూ అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడే ఓ వేదికను అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము.
 
సంవత్సరాంతపు సెలవుల సీజన్‌ ముగిసిన తరువాత కూడా యాత్రలు చేయాలనే అభిరుచి పెరుగుతుండటం, జనవరిలో కూడా ఆ ఆసక్తి కొనసాగుతుండటం  పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments