Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తే.. జైలు సిద్ధంగా వుందట...

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (17:00 IST)
రుణాల ఎగవేతలో భాగంగా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. రాజీకొచ్చారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా వున్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. 
 
తాను రుణాలను ఎగవేసే వ్యక్తిని కాదన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ.. బ్యాంకుల నుంచి రుణాలు పొంది పారిపోయానని సోషల్ మీడియా, మీడియా కోడైకూస్తోంది. దీనిపై విజయ్ మాల్యా మండిపడ్డారు. కోర్టులో తాను రుణం చెల్లించేందుకు సిద్ధంగా వున్న విషయాన్ని మీడియా ఎందుకు ఫోకస్ చేయలేదని ప్రశ్నించారు. 
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తే ఆయనను ఉంచేందుకు జైలు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. మాల్యాను భారత్‌కు తరలిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నెంబర్ 12 బ్యారెక్‌లో ఉంచనున్నారు. ఇందులో కొన్ని సదుపాయాల్ని సీబీఐ అధికారులు వీడియోలు తీసి గతంలోనే లండన్ కోర్టుకు జైలు అధికారులు పంపించారు. 
 
విజయ్ మాల్యాను ఉంచనున్న సెల్‌లో ఎల్సీడీ టీవీ, మెత్తటి పరుపు, దిండు, దుప్పట్లు ఏర్పాట్లు చేశారు. టీవీలో ఇంగ్లీష్, మరాఠీ ఛానెల్స్ వచ్చే ఏర్పాటు చేశారు. మాల్యాను ఉంచనున్న జైలుగదిలో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందని జైలు అధికారులు వీడియోలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments