Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు వ్యాపారి నుంచి లెక్క తేలని రూ.వెయ్యి కోట్లు స్వాధీనం

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (16:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ బంగారం వ్యాపారి నుంచి లెక్కల్లో చూపని రూ.1000 కోట్లను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 4న చెన్నై, ముంబై, కోయంబత్తూరు, మదురై, తిరుచురాపల్లి, త్రిసూర్, నెల్లూర్, జైపూర్, ఇండోర్‌లోని 27 చోట్ల దాడులు చేసినట్టు సీబీడీటి ప్రకటించింది. 
 
సోదాలకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించింది. అయితే, ఆ వ్యాపారి ఎవరు అన్న వివరాలను మాత్రం బహిర్గతం చేసింది. దాడుల సందర్భంగా లెక్క తేలని డబ్బు లావాదేవీలు, ఆ సంస్థ నుంచి బోగస్ రుణ చెల్లింపులు, అడ్వాన్స్ కొనుగోళ్ల రూపంలో రుణ చెల్లింపుల డమ్మీ ఖాతాలు, నోట్ల రద్దు సందర్భంగా ఖాతాల్లో డిపాజిట్ చేసిన లెక్క తేలని డబ్బు, వివరాల్లేని స్టాక్‌లను గుర్తించినట్టు పేర్కొంది. 
 
స్థానికంగా ఉన్న వారి దగ్గరి నుంచి అప్పులు తీసుకుని బిల్డర్లకు రుణాలిచ్చారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని చెప్పింది. ఇక, బంగారం అక్రమ కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. తనకు అప్పులున్నట్టు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, పాత బంగారాన్ని నగల తయారీకి వాడుకున్నట్టు చెప్పాడని పేర్కొంది. మొత్తంగా ఆ వ్యాపారి నుంచి రూ.1000 కోట్ల దాకా స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments