పలు ప్రత్యేక రైళ్లు రద్దు: జూన్ 11 వరకు రైలు సేవలు నిలిపివేత

Webdunia
శనివారం, 29 మే 2021 (13:51 IST)
కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. విజయవాడ మీదుగా నడుస్తున్న ఎనిమిది రైళ్లను జూన్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు కీలక ప్రకటనలో తెలియజేశారు. 
 
విశాఖపట్నం నుంచి కాచిగూడ వచ్చే ప్రత్యేక రైళ్లును జూన్‌ 1వ తేది నుంచి 10వ తేది వరకు నిలిపివేసింది దక్షిణ మధ్య రైల్వేశాఖ. ఇక కాచిగూడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌–పుణే, పుణే–భువనేశ్వర్‌, అలాగే కడప టూ విశాఖపట్నం, లింగపల్లి నుంచి విశాఖట్నం ట్రైన్లు కూడా రద్దు కాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్‌ చేసింది.
 
ఇక ఇప్పటికే.. పలు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు రద్దు చేస్తున్నట్లు స్పషం చేసింది. 
 
కరోనా ఉధృతి కారణంగా రైళ్లలో రద్దీ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక యాస్‌ తుఫాన్‌ ప్రభావంతో, దేశవ్యాప్తంగా పలు రైళ్లను ఇప్పటికే క్యాన్సల్‌ చేసింది రైల్వేశాఖ. 22 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments