Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి ఒకటి నుంచి పలు రైళ్ళ ప్రయాణ వేళల్లో మార్పులు...

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (19:27 IST)
దేశ వ్యాప్తంగా పలు రైళ్ళ ప్రయాణ వేళల్లో మార్పులు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైలు సర్వీసు ప్రయాణ వేళల్లో కూడా ఈ మార్పులు జరిగాయి. ఈ మేరకు దక్షిమ మధ్య రైల్వే మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. 
 
జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్)లో మారిన ప్రయాణ వేళలు చూసుకోవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments