రెండేళ్ల తరువాత పాల ధరలను పెంచిన సిద్స్‌ ఫార్మ్‌

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (21:43 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ తాము తమ పాల ధరలను పెంచినట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాల తరువాత ఈ పెంపుకు ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో పాటుగా ముడిసరుకుల ధరలు పెరగడం కారణం. పెంచిన ఈ ధరలతో ఆవుపాలు ధర 2 రూపాయలు పెరగ్గా, గేదె పాలు మూడు రూపాయలు, స్కిమ్డ్‌ పాలు మూడు రూపాయల ధర పెరిగింది.

 
పెంచిన ఈ ధరలతో 500 మిల్లీ లీటర్ల ఆవు పాలు ఇప్పుడు 40 రూపాయలకు, గేదె పాలు 48 రూపాయలకు లభిస్తే, స్కిమ్డ్‌ పాలు 30 రూపాయలకు లభిస్తాయి. సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘గత రెండు సంవత్సరాలుగా ముడి పాల ధరలు 15%కు పైగా పెరిగాయి. ఇంధన ధరలు 45% పెరిగాయి. ద్రవ్యోల్బణ ప్రభావంతో మేత, ప్రింటింగ్‌ ఇంక్‌ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

 
ఇవన్నీ కలిసి మొత్తంమ్మీద ఇన్‌ఫుట్‌ ధరలు పెంచాయి. దానితో తప్పనిసరై పాల ధరలు పెంచాల్సి వచ్చింది. నాణ్యతకు సిద్స్‌ ఫార్మ్‌ కట్టుబడి ఉంది. ఇటీవలి కాలంలో నాణ్యత నియంత్రణ కోసం సిద్స్‌ ఫార్మ్‌ గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. పెంచిన ఈ ధరలు మేము నాణ్యతను మరింతగా వృద్ధి చేసేందుకు సహాయపడతాయి’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: జో శర్మా నటించిన ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

సముద్ర తీరాన మత్స్యకారులతో కలిసిపోయి తెరచాప చిత్రీకరించాం : నవీన్ రాజ్

Ram Charan: సుల్తాన్, దంగల్' చిత్రాల జాతీయ కోచ్ వద్ద పెద్ది కోసం శిక్షణ తీసుకున్నా : రామ్ చరణ్

Virat Karna,: నాగబంధం లో సెకండ్ సింగిల్ సుర సుర సాంగ్ చిత్రీకరణ

Naga Shaurya: నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నా : నాగశౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

తర్వాతి కథనం
Show comments