Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవింగ్ ఖాతాలపై స్టేట్ బ్యాంకు బాదుడే బాదుడు...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:25 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులపై భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ భారం మోపేందుకు శ్రీకారం చుట్టనుంది. 
 
ఎస్పీఐ బ్యాంకుల్లో ఉండే బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాల ఛార్జీలను జూలై 1 నుంచి ఎస్‌బీఐ సవరిస్తుంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ (విత్‌డ్రాయల్స్‌) సదుపాయాన్ని నెలకు గరిష్టంగా నాలుగుకు మాత్రమే పరిమితం చేస్తోంది. 
 
ఆ పరిమితి మించితే ప్రతి నగదు ఉపసంహరణపైనా రూ.15 ప్లస్‌ జీఎస్‌టీని కలిపి వసూలు చేయనుంది. బ్యాంక్‌ శాఖలు, ఏటీఎంలు, ఇరత బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసే అన్ని అదనపు నగదు విత్‌డ్రాయల్స్‌కూ ఈ ఛార్జీలు వర్తిస్తాయి.  
 
అదేవిధంగా ఇకపై పరిమితికి మించి చెక్కులు కావాలన్నా కూడా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రస్తుతం బీఎస్‌బీడీ ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీఫ్స్‌ ఉండే ఒక చెక్‌బుక్‌‌ను ఎస్‌బీఐ ఉచితంగా జారీ చేస్తోంది. 
 
జూలై 1 నుంచి ఆ పరిమితి మించితే 10 లీఫ్స్‌ చెక్‌బుక్‌కు రూ.40 ప్లస్‌ జీఎస్టీ, 25 లీఫ్స్‌ చెక్‌బుక్‌కు రూ.75 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. అత్యవసరంగా 10 లీఫ్స్‌ చెక్‌బుక్‌ కావాలన్నా బీఎస్‌బీడీ ఖాతాదారులు రూ.50 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. అయితే సీనియర్‌ సిటిజన్లను ఈ అదనపు చెక్‌బుక్‌ చార్జీల నుంచి మినహాయిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments