Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను పారదోలటం ఇప్పట్లో జరిగే పనికాదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (15:18 IST)
కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి రవాణా వ్యవస్థ అక్కడే నిలిచిపోయింది. సంస్థలన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు వ్యాపారులు అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అన్నీ రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 
 
ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో లాక్ డౌన్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అన్ని రంగాలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. తాజాగా దేశంలో నెలకొన్న సంక్షోభంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పేదలను ఆదుకోవాలంటే కేంద్రానికి ఏకంగా రూ.65వేల కోట్ల నిధులు కావాలన్నారు. 
 
కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశం నుండి పూర్తిగా కరోనా వైరస్ పారదోలడం గాని లేదా కరోనా వైరస్ కేసుల సంఖ్య జీరో చేయడం కానీ ఇప్పట్లో జరిగే పని కాదంటూ వ్యాఖ్యానించారు. అయితే సామాజిక దూరాన్ని దేశ ప్రజలందరికీ అలవాటు చేస్తే భవిష్యత్తులో కూడా ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఓవైపు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూనే.. మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా చర్యలు చేపట్టడమే ప్రస్తుతం కేంద్రం చేయాల్సిన పని అని రఘురాం రాజన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments