Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఇన్ఫోకామ్‌లోమరో 30 వేల కోట్లు కుమ్మరించనున్న ఆర్ఐఎల్

అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోక మరో రూ. 30,000 కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇటీవలే తన బోర్డు సమావేశం ఏర్పాటు చేసిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ తన టెలికామ్ యూనిట్‌లోకి భారీ మొత్తంలో మదుపు చేయాలని, దీ

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (06:07 IST)
అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోక మరో రూ. 30,000 కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇటీవలే తన బోర్డు సమావేశం ఏర్పాటు చేసిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ తన టెలికామ్ యూనిట్‌లోకి భారీ మొత్తంలో మదుపు చేయాలని, దీనికోసం 600 కోట్ల విలువైన ప్రాధాన్యతా షేర్లను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. 
 
ఇప్పటికే ఆర్ఐఎల్ తన టెలికామ్ వెంచర్ జియో ఇన్ఫోకామ్‌లో లక్షా 71 కోట్ల రూపాయలను మదుపు చేసింది. 2016 సెప్టెంబర్ 5న ప్రారంభించిన నాటి నుంచి జియో మొత్తం 7 కోట్ల మంది యూజర్లను సంపాదించింది. సంస్థ ప్రకటించిన ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్ల ద్వారానే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంత తక్కువ కాలంలో ఇంతమంది వినియోగదారులను సంపాదించిన చరిత్ర ప్రపంచంలోనే ఏ కంపెనీకి సాధ్యపడలేదు.
 
అయితే నెట్‌వర్క్ కవరేజ్, కాల్ డ్రాప్‌ల సమస్య కారణంగా కస్టమర్ల విశ్వాసం దెబ్బతింటోందని గమనించిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా మదుపు చేయనున్న 30 వేల కోట్లతో ఈ సమస్యను అధిగమించగలనని విశ్వాసంతో ఉంది. పైగా అతి త్వరలో కేవలం రూ.900 లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లను ప్రారంభిస్తానని కంపెనీ ప్రకటించడం పోటీ సంస్థలను వణికిస్తోంది. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments