Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ టెల్ టెలికాం సేవలు మరింత ప్రియం..

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (10:25 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికా సంస్థల్లో ఒకటైన ఎయిర్‌‍టెల్ సేవలు మరింత ప్రియంకానున్నాయి. ఈ యేడాదిలో ఈ టారిఫ్ చార్జీలను స్వల్పంగా పెంచనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలాధన రాబడి తక్కువగా ఉన్నందున టారిఫ్ చార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 
 
వివిధ వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే ఉంటుందని తెలిపారు. దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమున్న మిట్టర్.. భారత్ డిజిటల్ - ఆర్థికవృద్ధి కల సాకారమైనట్టు వివరించారు. భారతీ ఎయిర్‌టెల్ మిట్టల్ గత నెలలో కనీస రీఛార్జ్‌ ధరను 57 శాతం పెంచగా త్వరలోనే టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతుంది. 
 
కాగా, ఎయిర్‌టెల్ 5జీ యూజర్లు 10 మిలియన్ల దాటినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 24 చివరి నాటికి 5జీ సేవలు దేశంలోని ప్రతి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చేరువయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపారు.. ఎయిర్‌టెల్ దేశంలోనే 5జీ సేవలను 2022 అక్టోబరు ఒకటో తేదీన ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments