Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు కుర్రాళ్ల ఎడ్‌టెక్‌ కంపెనీ నెక్స్ట్ వేవ్‌లో గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ నేతృత్వంలో రూ.275 కోట్ల పెట్టుబడి

image
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (23:32 IST)
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న నెక్స్ట్ వేవ్ తాజా ఫండింగ్‌ రౌండ్‌లో రూ.275 కోట్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ రౌండ్‌కి అగ్రగామి అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్ధ గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ (జీపీసీ) నేతృత్వం వహించింది. నెక్స్ట్ వేవ్ యొక్క ప్రస్తుత వెంచర్‌ ఇన్వెస్టర్‌ ఓరియోస్‌ వెంచర్‌ పార్టనర్స్‌ సైతం ఈ రౌండ్‌‌లో పాల్గొంది.
 
నెక్స్ట్ వేవ్ ని స్థాపించిన ఫౌండర్లు తెలుగు వారే. ఐఐటీ బొంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌ పూర్వ విద్యార్ధులు. ఐఐటీ బొంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌ పూర్వ విద్యార్ధులు- శశాంక్‌ రెడ్డి గుజ్జుల (మిర్యాలగూడ నుంచి), అనుపమ్‌ పెదర్ల (ఏలూరు నుంచి), రాహుల్‌ అట్లూరి (గోదావరిఖని నుంచి) ఈ కంపెనీని స్థాపించారు. అధునిక టెక్నాలజీ కెరీర్స్‌‌కు సిద్ధం చేసే భారతదేశపు అతి పెద్ద ఆన్లైన్ ఎంప్లాయబిలిటీ ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. 
 
యువకులలో కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలు పెంపొందించి ఐటీ ఉద్యోగాలు పొందేలా చేయడంలో నెక్స్ట్ వేవ్ అసాధారణ విజయం సాధించింది. గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్స్‌ మొదలుకొని ఫార్చ్యూన్‌ 500 సంస్ధల వరకు 1250కు పైగా కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను నియమించుకున్నాయి.
 
ఈ నూతన ఫండింగ్‌ గురించి నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్‌, సీఈఓ రాహుల్‌ అట్లూరి మాట్లాడుతూ ‘‘గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ మా ప్రయాణంలో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్‌‌కి నిలయంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. మన యువత అత్యంత ప్రతిభావంతులు. వారికి కావాల్సింది సరైన శిక్షణ. జీపీసీతో కలిసి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో అంతర్జాతీయ స్థాయి శిక్షణను తెలుగు రాష్ట్రాలలో ప్రతి మూలకూ తీసుకువెళ్లి రేపటి ఆధునిక ఉద్యోగాలకు వారిని సిద్ధం చేస్తున్నాము’’ అని అన్నారు.
 
మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక ప్రకారం రాబోయే పదేళ్లలో భారతదేశపు ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం పదమూడు లక్షల అరవై వేల కోట్ల విలువ ఉన్న ఎగుమతులు మూడేళ్లలో నలభై రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు అవుతుందని అంచనా. ఇది మన దేశ యువతకు అపారమైన కెరీర్‌ అవకాశాలను అందించనుంది. ఐటీ పరిశ్రమకు అనుగుణంగా ఉన్న కరికులం ద్వారా ఇండస్ట్రీ మరియు అకాడెమిక్స్ మధ్య అంతరాన్ని నెక్స్ట్ వేవ్ తొలగిస్తుంది.
 
జీపీసీ ఫౌండర్‌ మరియు సీఈఓ శ్రీ కేతన్‌ పటేల్‌ మాట్లాడుతూ, ‘‘ప్రపంచశ్రేణి ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను కలిగి ఉన్నప్పటికీ, ఈ ఇన్ఫర్మేషన్ శకంలో అగ్రగామిగా నిలవడానికి, తన 50 కోట్ల యువతకు మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడానికి, ముఖ్యంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‌లో, దేశం తన సామర్ధ్యాలను పెంచుకోవలసి ఉంది. భారత దేశాన్ని ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మార్చడానికి అలానే యువతకు మెరుగైన ఉద్యోగాల కల్పించడానికి టెక్నాలజీని ఉపయోగించి ఈ సామర్ధ్యాలను పెంచుకోవడం ఎంతో కీలకం. ఈ పని నెక్స్ట్ వేవ్ చేస్తుంది. నెక్స్ట్ వేవ్‌తో  భాగస్వామ్యం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. శరవేగంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించి అత్యున్నత ప్రమాణాల శిక్షణను భారతీయ యువతకు చేరువ చేస్తాము” అని అన్నారు. ఈ లావాదేవీలో భాగంగా జీపీసీ ఇండియా కో హెడ్‌ , ఎండీ నందన్‌ దేశాయ్‌ నెక్స్ట్ వేవ్ బోర్డ్‌లో చేరనున్నారు.
 
ఈ పెట్టుబడి గురించి ఓరియోస్‌ వెంచర్‌ పార్టనర్స్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ అనూప్‌ జైన్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో దాదాపు 63% మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి అవకాశాలను పొందలేకపోతున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో దాదాపు 30 లక్షల టెక్‌ ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఇలాంటి పరిస్థితిలో సంవత్సరానికి 8 బిలియన్‌ డాలర్లు టెక్‌-అప్‌ స్కిల్లింగ్‌ అవకాశాలున్నాయి. ఈ అంతరాన్ని విజయవంతంగా నెక్స్ట్ వేవ్ తొలిగించింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమైంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ మొదటి అనుభవ కేంద్రం ప్రారంభం