ద్రవ్యోల్బణం తగ్గింది.. జూలై నెలకు 5.27 శాతం డౌన్

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (23:45 IST)
ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.27 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. జూన్ నెలలో ఇది 5.57 శాతంగానూ, గతేడాది జూలైలో 5.33 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 
 
పాలు, ఉల్లి, టమోటాలతో పాటు వంట గ్యాస్, ప్రయాణ రేట్లు, పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణంగా నిలిచాయి. ఇదే సమయంలో వంట నూనె, చేపలు వంటి వాటి ధరలు పడిపోవడం కొంతమేర ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.
 
ఆహార ద్రవ్యోల్బణం 4.91 శాతానికి క్షీణించింది. జూన్‌లో ఇది 5.61 శాతంగా, గతేడాది జూలైలో 6.38 శాతంగా నమోదైంది. మరోవైపు ముడి చమురు మినహా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. జూలైలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 9.4 శాతం పెరిగింది. గతేడాది కొవిడ్ వల్ల ప్రధాన రంగాల ఉత్పత్తి ఇదే నెలలో 7.6 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments