Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోట్లు మార్పిడిలో రూల్స్ పాటించాల్సిందే : ఆర్బీఐ గవర్నర్

Webdunia
సోమవారం, 22 మే 2023 (14:11 IST)
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా, రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్నామని, అయితే ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్టు భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. బ్యాంకుల్లో రూ.2 వేల నోటును మార్పిడి చేసుకునే సమయంలో ఎప్పటిలానే రూల్స్ పాటించాల్సిందేనని ఆయన తెలిపారు. 
 
రూ.2 వేల నోటు ఉపసంహరణపై ఆయన స్పందించారు. కరెన్సీ మేనేజ్‌మెంట్‌లో భాగంగా, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. క్లీన్ నోట్ పాలసీని ఆర్బీఐ ఎప్పటి నుంచో అమలు చేస్తుందన్నారు. వివిధ డినామినేషన్ల నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అపుపడుపూ ఉపసంహరించుకుంటుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే, ఇపుడు రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. 
 
అయితే, నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ల విషయంలో ఇప్పటివరకు అవలంభిస్తున్న నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని, ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయని, వాటినే ఇపుడు బ్యాంకులు కూడా అమలు చేస్తాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments