రైల్వే ఈ-టిక్కెట్‌పై రూపాయి చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల బీమా

ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని బీమా సంస్థలతో కలిసి ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో తన ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింద

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (09:05 IST)
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని బీమా సంస్థలతో కలిసి ఈ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో తన ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రైలు ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పించింది.
 
ఈ-టికెట్‌ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్‌‌గా మార్చింది. ఇకపై ఆన్‌లైన్‌లో ఐఆర్‌‌సీటీసీ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. టికెట్‌ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్‌ కూడా ఒక ఆప్షన్‌గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు.
 
ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్‌ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది. 
 
స్లీపర్, ఏసీ, చెైర్‌ కార్‌ సీట్ల కోసం టికెట్లు బుక్‌ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారికే వదిలేసింది. దీనికోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్‌ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో రైల్వే శాఖ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం