Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బోర్డు సీఈవోగా తొలిసారి ఓ మహిళకు ఛాన్స్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:57 IST)
రైల్వే బోర్డు ఛైర్ పర్సన్, సీఈవోగా దేశంలో తొలిసారి ఓ మహిళకు కేంద్రం అవకాశం ఇచ్చింది. రైల్వే బోర్డు కొత్త సీఈవోగా జయావర్మ సిన్హాను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆమె రైల్వే బోర్డు సభ్యురాలిగా కొనసాగుతూ వచ్చారు. రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అనిల్ కుమార్ లహోటి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని రైల్వే బోర్డు సభ్యురాలిగా ఉన్న జయా వర్మ సిన్హాతో భర్తీ చేశారు. రైల్వే బోర్డు చరిత్రలో ఓ మహిళ చైర్‌పర్సన్‌గా, సీఈవోగా నియమితులు కావడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈమె రైల్వేలో ట్రాఫిక్ విభాగంలో అధికారిణి. ప్రస్తుతం రైల్వే బోర్డులో కార్యకలాపాలు - వ్యాపార ఆభివృద్ధి విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఆమెను రైల్వే బోర్డు కొత్ చీఫ్‌గా నియమిస్తున్నట్టు రైల్వేశాఖ విడుదల చేసి ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకానికి కేంద్ర నియామకాల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈమె వచ్చే యేడాది ఆగస్టు 31వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments