Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణీకులకు షాక్.. యూడీఎఫ్ చెల్లించాలట.. ఛార్జీలు పెరుగుతాయట!

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:20 IST)
రైలు ప్రయాణీకులకు పెద్ద షాక్ తప్పేలా లేదు. కరోనా నేపథ్యంలో రైళ్ల రాకపోకలు ఆగపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో వసూలు చేసినట్టు ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు-యూడీఎఫ్ చెల్లించాల్సి వస్తుందన్న వార్తలొస్తున్నాయి. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది భారతీయ రైల్వే. 
 
ఆ రైల్వే స్టేషన్లలోకి ఎంటరైతే ఈ ఛార్జీలు చెల్లించక తప్పదు. అయితే ఎంత ఛార్జీలు వసూలు చేస్తారన్న స్పష్టత లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతీయ రైల్వే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అయితే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఆధునిక సదుపాయాలు కల్పిస్తే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తుంది రైల్వే.
 
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‍షిప్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుల్ని రైల్వే చేపట్టనుంది. బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలు ఈ పనులను చేజిక్కించుకుంటారు. ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించి కమర్షియల్ కాంప్లెక్సులు, యూజర్ ఫీజుల ద్వారా లాభాలు పొందుతారు. అలాగే ప్రైవేట్ సంస్థలు ఆధునీకరించే రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుల్ని రైలు ప్రయాణికులు చెల్లించక తప్పదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments