Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి కంపెనీ యజమానుల కొత్త ఎత్తుగడ... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (15:04 IST)
భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు సెప్టెంబరు నెలాఖరుతో దేశ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న రూ.2 వేల నోటు రద్దు కానుంది. తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటును ఈ గడువు లోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీల యజమానులు తమ వద్ద మూలుగుతున్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నాయి. 
 
నిన్నామొన్నటి వరకు బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టిన యజమానులు ఇపుడు తమ వద్ద పని చేసే ఉద్యోగులకు రూ.2 వేల నోట్లను వేతనాలుగా ఇస్తున్నాయి. పైగా, ఇప్పటివరకు ఐదు నుంచి పదో తేదీ వరకు చెల్లించే వేతనాలను ఇపుడు ఒకటో తేదీనే ఠంచనుగా ఇచ్చి, స్వామి కార్యం స్వకార్యం పూర్తయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. 
 
సాధారణంగా ప్రతినెలా నాలుగు, ఐదో తేదీల్లో వేతనాలు ఇస్తుండగా మే నెల జీతం జూన్‌ ఒకటో తేదీనే ఇవ్వడంతో ముందే ఇస్తున్నారన్న సంతోషంతో వాటిని తీసుకున్నామని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరు వేతనం రూ.10 వేలు ఉంటే రూ.20 వేలు చేతిలో పెట్టి మరో పదివేలు బ్యాంకులో మార్చుకొని రావాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇలా జూన్‌ ఒకటో తేదీన నగరంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments