Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ఆతిథ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చిన పీఆర్ఎస్ ఓబెరాయ్ ఇకలేరు...

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (12:25 IST)
భారత దేశ హోటల్ వ్యాపార ముఖ చిత్రాన్ని మార్చిన పారిశ్రామికవేత్తల్లో ఒకరు, ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పీఎస్ఆర్ ఒబెరాయ్ ఇకలేరు. 94 యేళ్ళ వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని ఒబెరాయ్ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరుగనున్నాయి. తమ ప్రియతమ నాయకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూశారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని ఆ గ్రూపు అధికార ప్రతినిధి వెల్లడించారు.
 
ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతో పాటు భారత్, విదేశీ ఆతిథ్య రంగానికి తీవ్రమైన నష్టమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ చారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, పీఆర్ఎస్ ఒబెరాయ్ దూరదృష్టి గల నాయకుడు అని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూపు హోటళ్ళను ప్రపంచ వ్యాప్తంగా తీర్చిదిద్దారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన విస్తరించిన హోటళ్ళు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్త రూపు తీసుకొచ్చి, ప్రత్యేక గుర్తింపును అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments