Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం షాక్ : రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (09:10 IST)
దేశ ప్రజలకు కేంద్రం షాకిచ్చింది. రూ.2 వేల నోటు ముద్రణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థలో రూ.2 వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నందున ప్రస్తుతానికి వాటి ముద్రణను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
 
ప్రస్తుతం దేశంలో రూ.2 వేల నోటు చలామణిలో ఉంది. ఈ నోటును కూడా చలామణి నుంచి తీసేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామన్నారు. 'మన వ్యవస్థలో అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో విలువపరంగా చూస్తే, 35 శాతానికి పైగా వాటా రెండు వేల నోట్లదే. రెండు వేల నోట్ల ముద్రణ విషయంలో ఇటీవల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. 
 
కాగా, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల ముద్రణను నిలిపివేసిన విషయం తెల్సిందే. పెద్ద నోట్ల రద్దు సమయంలో మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు 86 శాతం వాటా రూ.100, రూ.500 నోట్లదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments