Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎన్‌బీ స్కామ్‌లో ఆర్బీఐ అధికారుల పాత్ర?

దేశ బ్యాంకింగ్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో భారత రిజర్వు బ్యాంకు అధికారులతో పాటు.. పీఎన్‌బీ బ్యాంకు సీనియర్ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (10:36 IST)
దేశ బ్యాంకింగ్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో భారత రిజర్వు బ్యాంకు అధికారులతో పాటు.. పీఎన్‌బీ బ్యాంకు సీనియర్ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పీఎన్బీ బ్యాంకు మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి సహకరించడం వల్లే ఈ స్కామ్ జరిగినట్టు సీబీఐ అధికారులు ప్రాథమిక నిర్ధారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ స్కామ్‌లో పీఎన్బీ ఉన్నతాధికారులు, ఆర్బీఐ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పీఎన్బీ ఛైర్మన్ సహా‌, ఆర్బీఐ ఉన్నతాధికారులను సీబీఐ దృష్టి పెట్టింది. 
 
ముఖ్యంగా, రూ.వేల కోట్ల అవినీతిని ఆయా బ్యాంకు శాఖల ఇంటర్నెల్‌ ఆడిటింగ్‌ సందర్భంగా ఆర్బీఐ ఎందుకు కనిపెట్టలేదనే విషయాన్ని సీబీఐ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇకపోతే, బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌గా పని చేసిన గోకుల్‌నాథ్‌ శెట్టి ఏడేళ్లపాటు ఒకే స్థానంలో కదలకుండా ఉండి.. నీరవ్‌ మోదీకి, గీతాంజలి జెమ్స్‌కు బ్యాంకు తరపున లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) జారీ చేశారు. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా విషయం బయటకు రాలేదు. ఎవరికంటా పడలేదు. పోనీ ఈ ఏడేళ్లలో ఆయన కొన్నిరోజులు సెలవు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఇపుడు దీనిపైనే సీబీఐ అదికారు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం గోకుల్‌నాథ్ శెట్టిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments