Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణెం.. రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (16:19 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రిలీజ్ చేశారు. వాజ్‌పేయి జయంతి వేడుకలకు ఒక రోజు ముందే ఈ నాణేంను విడుదల చేయడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 'అటల్‌జీ ఇక మనతో లేరన్న విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడాయన' అని కొనియాడారు. 
 
కాగా, ఈ నాణేనికి మాజీ ప్రధాని వాజ్‍పేయి చిత్రంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. అలాగే, వాజ్‌పేయి చిత్రం కింద జనన మరణ సంవత్సరాలను కూడా చూడొచ్చు. మరోవైపు అశోక చక్రం, సత్యమేవ జయతే నినాదం, రూ.100 అంకెతో పాటు భారతదేశం పేరును హిందీ, ఇంగ్లీషులో ముద్రించారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments