Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. రెండేళ్ళ గరిష్ట స్థాయికి!

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:36 IST)
దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయ. ఈ పెరుగుదల రెండేళ్ళ గరష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోలు, డీజిల్‌పై 25 నుంచి 33 పైసల వరకు ధరలను పెంచుతున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. 
 
దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.83.71కి, డీజిల్ ధర రూ.73.87కు చేరుకున్నాయి. నవంబర్ నెలలో 20వ తేదీ నుంచి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 20తో పోలిస్తే, లీటరు పెట్రోలుపై రూ.3.65, డీజిల్ పై రూ.3.40 వంతున ధరలు పెరిగాయి. 
 
ఇకపోతే, ముంబై నగరంలో సోమవారం పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ.90.34కు చేరగా, కోల్‌కతాలో రూ.85.19కి, చెన్నైలో రూ.86.51కి చేరింది. ఇదేసమయంలో డీజిల్ ధర ముంబైలో రూ.80.51కి, కోల్‌కతాలో రూ.77.44కు, చెన్నైలో రూ.79.21కి చేరాయి. 
 
ఒపెక్ దేశాలన్నీ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడం, రష్యా కూడా అదే దారిలో నడుస్తూ ఉండటంతోనే క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments