Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న చమురు ధరల బాదుడు - వరుసగా ఐదో రోజు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (09:20 IST)
దేశంలో చమురు ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వరుసగా ఐదో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా సోమవారం చమురు కంపెనీలు ధరలను మరోసారి పెంచాయి. 
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.120 మార్క్‌ను ధాటింది.
 
సోమవారం తొలిసారిగా లీటర్‌ పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.69 చేరింది. డీజిల్‌ లీటర్‌కు రూ.98.42, ముంబైలో పెట్రోల్‌ రూ.115.50, డీజిల్ రూ.106.62కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.106.35, డీజిల్ రూ.102.59కు చేరింది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.114.13, డీజిల్‌ రూ.107.40కు చేరింది. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు తగ్గించాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నా ధరలు పైపైకి కదులుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments