Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ చరిత్రలో తొలిసారి.. పెట్రోల్ - డీజిల్ ధరలు సమానం

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:51 IST)
దేశ చరిత్రలో తొలిసారి ఓ రికార్డు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. గత 17 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. బుధవారం అంటే 18వ రోజు కూడా ఈ ధరలు పెట్రో ధరలు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెంచాయి. ఫలితంగా దేశంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. 
 
దేశంలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, నిత్యమూ 'పెట్రో' ధరలను పెంచుకుంటూ పోతుండగా, ఈ 19 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.10 వరకూ ధర పెరిగింది. ఇదేసమయంలో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. 
 
ప్రస్తుతం హస్తినలో పెట్రోలు ధర లీటరుకు రూ.79.88వుండగా, డీజిల్ ధర రూ.79.40కి చేరుకుంది. ఏ దేశంలోనైనా పెట్రోల్‌తో పోలిస్తే, డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. 
 
అయితే, ఢిల్లీలో డీజిల్ వాహనాల సంఖ్య భారీ‌గా పెరిగిపోవడంతో ప్రభుత్వం డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రెండు ఇంధనాల ధరా సమానమైంది. 
 
కాగా, ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు. ఈ నగరాల్లో మాత్రం వీటి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments