Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా ఇడ్లీ, సాంబార్‌లో బొద్దింక.. షాకైన ప్రయాణీకుడు..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:17 IST)
భోపాల్ నుంచి శనివారం ముంబైకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో రోహిత్ రాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ప్రయాణించాడు. రోహిత్‌కు ఎయిర్ ఇండియా ఆహారం సరఫరా చేసింది. ఓ ప్యాక్‌లో ఇడ్లీ, సాంబార్, వడను అందజేసింది.
 
ఇడ్లీ, సాంబార్‌ను తింటూ వుండగా.. అందులో బొద్దింక వుండటాన్ని గమనించి షాక్ అయ్యాడు. ఈ వ్యవహారంపై రోహిత్ ఫిర్యాదు చేసినా ఎయిర్ ఇండియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విమానం దిగిన తర్వాత ఎయిర్ ఇండియా ఉన్నతాధికారికి రోహిత్ లేఖ రాశాడు. 
 
అయినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. చివరికి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. ఎయిర్ ఇండియా ఆహారంలో బొద్దింక అంటూ రాశాడు. ఫోటోలను పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో రోహిత్ చేసిన పోస్టు వైరలై కూర్చుంది. దీంతో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజేంద్ర మల్హోత్రా రోహిత్‌తో మాట్లాడారు. 
 
రోహిత్ పంపిన లేఖ తనకు అందలేదని.. ఈ వ్యవహారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి తాను చింతిస్తున్నానని.. ఇంకా బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని రాజేంద్ర మల్హోత్రా చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments