Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా ఇడ్లీ, సాంబార్‌లో బొద్దింక.. షాకైన ప్రయాణీకుడు..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:17 IST)
భోపాల్ నుంచి శనివారం ముంబైకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో రోహిత్ రాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ప్రయాణించాడు. రోహిత్‌కు ఎయిర్ ఇండియా ఆహారం సరఫరా చేసింది. ఓ ప్యాక్‌లో ఇడ్లీ, సాంబార్, వడను అందజేసింది.
 
ఇడ్లీ, సాంబార్‌ను తింటూ వుండగా.. అందులో బొద్దింక వుండటాన్ని గమనించి షాక్ అయ్యాడు. ఈ వ్యవహారంపై రోహిత్ ఫిర్యాదు చేసినా ఎయిర్ ఇండియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విమానం దిగిన తర్వాత ఎయిర్ ఇండియా ఉన్నతాధికారికి రోహిత్ లేఖ రాశాడు. 
 
అయినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. చివరికి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. ఎయిర్ ఇండియా ఆహారంలో బొద్దింక అంటూ రాశాడు. ఫోటోలను పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో రోహిత్ చేసిన పోస్టు వైరలై కూర్చుంది. దీంతో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజేంద్ర మల్హోత్రా రోహిత్‌తో మాట్లాడారు. 
 
రోహిత్ పంపిన లేఖ తనకు అందలేదని.. ఈ వ్యవహారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి తాను చింతిస్తున్నానని.. ఇంకా బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని రాజేంద్ర మల్హోత్రా చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments