Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు ఊరట.. పాత రూ.500 నోట్లతో విత్తనాలు కొనుక్కోవచ్చు : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు ఓ మంచి సమాచారాన్ని వెల్లడించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్టు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన బ్యాంకు కస్టమర్లకు ఉన్న కష్టాలు తొలగించే చర్యల్లో భాగంగా కొంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:42 IST)
భారత రిజర్వు బ్యాంకు ఓ మంచి సమాచారాన్ని వెల్లడించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్టు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన బ్యాంకు కస్టమర్లకు ఉన్న కష్టాలు తొలగించే చర్యల్లో భాగంగా కొంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ తరహా బ్యాంకు ఖాతాలు కలిగిన కష్టమర్లు నగదు విత్‌‌డ్రా పరిమితిని వారంలో రూ.50 వేలకు పెంచింది. అయితే, వీరికి రూ.2 వేల నోట్లు మాత్రమే ఇస్తారు. 
 
కనీసం మూడు నెలల నుంచి ఈ ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ.50 వేలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టంచేసింది. అలాగే, రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు చేసిన పాత రూ.500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
 
ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేయొచ్చని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ యూనివర్సిటీలు, ఐసీఏఆర్‌ సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు మంగళవారం నుంచి రూ.2.5 లక్షల విత్‌ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ నగదు లేకపోవడంతో ఇప్పటివరకు ఇది అమలు కాలేదని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం