Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ యేడాది దేశ జీడీపీ సున్నా : విత్తమంత్రి నిర్మలా సీతారామన్

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (21:29 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా దేశ స్థూల జాతీయోత్పత్తి సున్నాగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవనం కనిపించే సంకేతాలు కనిపిస్తున్నాయని  చెప్పుకొచ్చారు. 
 
మంగళవారం జరిగిన సెరావీక్ 4 వ వార్షిక ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 23.9 శాతం భారీ సంకోచం ఉండటమే దీనికి ప్రధాన కారణమన్నారు. మహమ్మారి కారణంగా పూర్తి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రంగాలు కోలుకుంటున్నాయని గుర్తుచేశారు. 
 
ప్రాథమిక రంగంలో రికవరీ సిగ్నల్స్ కనిపించాయన్నారు. గ్రామీణ రంగం బాగా పనిచేస్తున్నదని, ఆటో అమ్మకాలు మంచి వృద్ధిని సాధించాయన్నారు. భారతదేశంలో పండగ సీజన్ మొదలైనందున డిమాండ్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. మూడు, నాలుగో త్రైమాసికంలో మరింత సానుకూల వృద్ధి సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 2019 ఏప్రిల్-ఆగస్టుతో పోల్చితే 2020 ఏప్రిల్-ఆగస్టులో కొవిడ్‌-19 ఉన్నప్పటికీ 13 శాతం వృద్ధిని సాధించిందని ఆమె గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments