ముంబైలో పరుగులు తీయనున్న మెట్రో రైళ్లు

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (18:35 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రకాల రైల్ సర్వీసులు ఆగిపోయాయి. అయితే, లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడిపింది. ఆ తర్వాత ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. ఈ క్రమంలో దసరా స్పెషల్స్ పేరుతో 392 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. 
 
ఈ సర్వీసులు ఈ నెల 20వ తేదీ నుంచి పట్టాలపైకి రానున్నాయి. ఈ క్రమంలో ముంబై మహానగరంలో కూడా సోమవారం (అక్టోబరు 19) నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా గ‌త మార్చిలో నిలిచిపోయిన మెట్రో స‌ర్వీసులు దాదాపు ఏడు నెల‌ల విరామం త‌ర్వాత తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. 
 
ఆ మేర‌కు ముంబై మెట్రో రైల్ కార్పోరేష‌న్‌ ఏర్పాట్లు చేస్తున్న‌ది. అన్‌లాక్‌-5 మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో స‌ర్వీసుల‌ను ప్రారంభిస్తున్నారు. మెట్రో రైల్ స్టేష‌న్‌ల‌లో, మెట్రో రైళ్ల‌లో కొవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు అక్క‌డి మెట్రోరైల్ కార్పొరేష‌న్ తెలిపింది. 
 
స్టేష‌న్‌లోకి వ‌చ్చే ప్ర‌తి ప్ర‌యాణికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హిస్తామ‌ని, ముఖానికి మాస్కు ధ‌రించిన వారినే స్టేష‌న్‌లోకి అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించింది. అలాగే, ముంబై మోనో రైల్ సర్వీసులు కూడా తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలంటే కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments