Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ తర్వాత రూ.33ను రీఫండ్ చేసిన ఐఆర్‌సీటీసీ

Webdunia
గురువారం, 9 మే 2019 (10:15 IST)
ఓ ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న రిజర్వేషన్ టిక్కెట్‌ను రద్దు చేసుకున్నాడు. ఇలాంటి సమయాల్లో క్లరికల్ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని ఏడు పనిదినాల్లో ప్రయాణికుడు ఖాతాలో జమ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఓ ప్రయాణికుడుకి రెండేళ్ళ తర్వాత రూ.33 రీఫండ్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాకు చెందిన ఇంజినీర్ సుజీత్ స్వామి (30) గత 2017 జూలై 2న ఢిల్లీ వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. గోల్డెన్ టెంపుల్ ‌రైలులో టికెట్‌కు గాను రూ.765 చెల్లించాడు. అయితే, అనివార్య కారణాల వల్ల జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు రోజు టికెట్‌ను రద్దు  చేసుకున్నాడు. 
 
అయితే, టికెట్ రద్దు చేసుకున్న సుజీత్‌కు కేన్సిలేషన్ చార్జీ రూ.65, జీఎస్టీ రూ.35 కలుపుకుని రూ.100 తగ్గించి ఇవ్వడంతో సుజీత్ అవాక్కయ్యాడు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందే తాను టికెట్‌ను రద్దు చేశానని, కట్ చేసిన రూ.35 ఇవ్వాలని ఐఆర్‌సీటీసీని కోరాడు. 
 
వారు నిరాకరించడంతో సుజీత్ గతేడాది ఏప్రిల్‌లో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించాడు. ఈ కేసులో తాజాగా సుజీత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. లోక్ అదాలత్ తీర్పుతో ఐఆర్‌సీటీసీ రెండేళ్ల తర్వాత తాజాగా అదనంగా కట్ చేసిన రూ.33ను స్వామి ఖాతాలో జమచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments