Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఉల్లి ధరలు.. మహారాష్ట్రలో ఉల్లి నాశనమైపోవడంతో..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:45 IST)
ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుంటే ఇప్పుడు ఉల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి భారమైపోతోంది. గతంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెటించి సాధారణ ధరల లభిస్తున్నాయనుకుంటే ఇప్పుడు మళ్లీ ఉల్లి ఘాటెక్కిపోతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబైలో గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. 
 
ఈ ఏడాది మొదట్లో ఉల్లి ధర రూ.25 నుంచి 30 రూపాయలు ఉండగా, ప్రస్తుతం కిలో ఉల్లి ధర 60 నుంచి 70 రూపాయల వరకు చేరుకుంది. దీంతో ప్రజలు మళ్లీ లబోదిబోమంటున్నారు. గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట అధికంగా నాశనమైపోయింది. దీంతో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కిపోతోంది.
 
ఉత్పత్తి లేకపోవడం కారణంగా సరఫరా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రేట్లపైగా పెరిగింది. నవీ ముంబైలో ఏపీఎంసీ మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు రూ.30-40 హోల్‌ సేల్‌ ధరకు అమ్మేవారు. ముంబై, పూణే, థానే రిటైల్‌ మార్కెట్లలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి 70 వరకు అమ్మడవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments