Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణ గ్రహీతలకు తీపికబురు.. యధాతథంగా కీలక వడ్డీరేట్లు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:38 IST)
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్దనే నిలకడగా కొనసాగుతోంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది.
 
రిజర్వు బ్యాంక్ 2020 మే 22న చివరిగా కీలకమైన పాలసీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి రేట్లు స్థిరంగాన ఉంటూ వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. 
 
రుణ రేట్లు కూడా స్థిరంగానే కొనసాగే అవకాశముంది. పెరగకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంకులు రుణ రేట్లను మరింత తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. రుణ గ్రహీతలకు ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2021-22 తర్వాత ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments