Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో కొత్త శాఖను ప్రారంభించిన జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్

ఐవీఆర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (20:19 IST)
జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో తన కొత్త శాఖను ప్రారంభించినట్లు వెల్లడించింది. పవర్‌పేట్ ప్రాంతంలో ఉన్న ఈ శాఖ, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 10వ శాఖ కాగా భారతదేశంలో 126వ శాఖ. ఈ వ్యూహాత్మక విస్తరణ దక్షిణ భారతదేశంలో కంపెనీ కార్యకలాపాలను మరింత బలపరుస్తుంది, ఇది సరసమైన గృహ రుణాలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సీనియర్ అధికారుల సమక్షంలో జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ శ్రీ మనీష్ సేథ్ ఈ కొత్త శాఖను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్, ఎండి & సీఈఓ శ్రీ మనీష్ సేథ్ మాట్లాడుతూ, “మా 126వ శాఖను ఆంధ్రప్రదేశ్‌లో  ప్రారంభించడం సంతోషంగా వుంది. మా సరసమైన, పారదర్శకమైన, సులభంగా లభించగల గృహ ఋణ పరిష్కారాలతో, మేము నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో గృహ ఋణ డిమాండ్‌ను తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. వ్యక్తులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడంలో మా నిబద్ధతను ఇది  నొక్కి చెబుతుంది' అని అన్నారు.
 
జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు మరియు గృహ నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ కోసం ఋణాలతో సహా అనేక రకాల ఋణ ఉత్పత్తులను అందిస్తుంది.  ఈ శాఖ ప్రారంభంతో, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది, ఈ ప్రాంతంలోని గృహ కొనుగోలుదారులకు తగిన పరిష్కారాలను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments