ఏలూరులో కొత్త శాఖను ప్రారంభించిన జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్

ఐవీఆర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (20:19 IST)
జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో తన కొత్త శాఖను ప్రారంభించినట్లు వెల్లడించింది. పవర్‌పేట్ ప్రాంతంలో ఉన్న ఈ శాఖ, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 10వ శాఖ కాగా భారతదేశంలో 126వ శాఖ. ఈ వ్యూహాత్మక విస్తరణ దక్షిణ భారతదేశంలో కంపెనీ కార్యకలాపాలను మరింత బలపరుస్తుంది, ఇది సరసమైన గృహ రుణాలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సీనియర్ అధికారుల సమక్షంలో జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ శ్రీ మనీష్ సేథ్ ఈ కొత్త శాఖను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్, ఎండి & సీఈఓ శ్రీ మనీష్ సేథ్ మాట్లాడుతూ, “మా 126వ శాఖను ఆంధ్రప్రదేశ్‌లో  ప్రారంభించడం సంతోషంగా వుంది. మా సరసమైన, పారదర్శకమైన, సులభంగా లభించగల గృహ ఋణ పరిష్కారాలతో, మేము నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో గృహ ఋణ డిమాండ్‌ను తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. వ్యక్తులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడంలో మా నిబద్ధతను ఇది  నొక్కి చెబుతుంది' అని అన్నారు.
 
జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు మరియు గృహ నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ కోసం ఋణాలతో సహా అనేక రకాల ఋణ ఉత్పత్తులను అందిస్తుంది.  ఈ శాఖ ప్రారంభంతో, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది, ఈ ప్రాంతంలోని గృహ కొనుగోలుదారులకు తగిన పరిష్కారాలను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments