Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.10 వ్యయంతో 98 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్!

ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (17:14 IST)
భారత టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ఎంచుకునేవారికి రోజుకు పది రూపాయల సమాన వ్యయంతో 98 రోజుల కాలపరిమితితో 999 రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద ప్రతి రోజూ 2 జీబీ డేటాను ఇవ్వనుంది. వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్స్‌ లభిస్తాయి. అలాగే, అపరిమిత 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ సేవలను కూడా పొందవచ్చు. అలాగే, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను కూడా రిలయన్స్ కస్టమర్లు పొందవచ్చు.
 
గత జూన్ నెలలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌తో పాటు రిలయన్స్ జియో కంపెనీలు ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లను భారీగా పెంచిన విషయం తెల్సిందే. దీంతో అనేక మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు మారిన విషయం తెల్సిందే. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని దిద్దిబాటు చర్యగా కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు జియో సరసమైన ఈ రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. మరోవైపు ఎయిర్ టెల్ కూడా పలు కొత్త ప్లాన్లను ప్రకటించింది. అదనపు డేటా ప్లాన్‌ల వ్యాలిడిటీలను పెంచుతూ పలు సరమైన ఆఫర్లను ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments