Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 డిసెంబరులో రూ.35,000 కోట్ల విలువ చేసే బంగారం దిగుమతి

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (14:46 IST)
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు పసిడి ప్రియులు. దీంతో భారీగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం డిమాండ్‌కు మన దేశంలో భలే గిరాకీ ఉంది. ఫలితంగా గత 2021లో ఏకంగా 35 వేల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. 
 
గత 2021లో డిసెంబరు నెలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గత 2020 డిసెంబరు నెలలో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 2021తో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగింది. 
 
ఇకపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు నెల వరకు తొమ్మిది నెలల కాలంలో 38 బిలియన్ డాలర్ల విలువ పసిడి దిగుమతులు నమోదైనట్టు తెలిపింది. 
 
కానీ, 2020 ఏప్రిల్ - డిసెంబరు కాలంలో ఇది 16.78 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. అంటే 2021 సంవత్సరంలో బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యిందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో పసిడి దిగుమతులు పెరిగినందున వాణిజ్య లోటు 142 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments