Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 యేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (13:35 IST)
దేశంలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఏకంగా 20 యేళ్ళ కనిష్టానికి ఈ ధరలు తగ్గిపోయాయి. గత డిసెంబరు నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 79 శాతం మేరకు తగ్గిపోయాయి. రెండు దశాబ్దాల కాలంలో ఇంత కనిష్టానికి పడిపోవాడం ఇదే కావడం గమనారం. 
 
ప్రస్తుతం బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు నెలలో 20 టన్నుల బంగారం దిగుమతి అయింది. కానీ 2021 డిసెంబరు నెలలో దిగుమతులు 95 టన్నులుగా ఉండటం గమనార్హం. విలువపరంగా చూస్తే యేడాది క్రితం 4.73 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేుసుకోగా, క్రితం నెలలో 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 
 
ఇక 2022లో మన దేశంల 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది.2021లో 1068 టన్నుల దిగుమతి బంగారంతో పోల్చితే గత యేడాది 30 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తుంది. మన దేశ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల రూపంలోనే తీరుతుంది. గత యేడాది ఈ బంగారం దిగుమతి కోసం ఏకంగా 33.6 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments