Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు కూర్చొని ప్రయాణించే బుల్లి ఎలక్ట్రిక్ కారు..

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (14:37 IST)
ముగ్గురు కూర్చుని ప్రయాణించేలా బుల్లి ఎలక్ట్రిక్ కారును తయారైంది. ఈ కారు ధర రూ.4.79 లక్షలుగా నిర్ణయించచారు. అయితే, తొలి 10 వేల బుకింగులకు మాత్రమే ఈ ధరను అందిస్తారు. దీంతో ఇప్పటివరకు ఈ కారు కోసం ఆరు వేల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే, స్థానిక రవాణా పన్నులు, బీమా చార్జీలు, యాక్సెసరీ చార్జీలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ రేటుకు లభ్యమయ్యే వాహనం ఇదే కావడం గమనార్హం.
 
ఈ ఎలక్ట్రిక్ కారును పూణెకు చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసింది. ఈ కారును బుక్ చేయాలనుకునేవారు పీఎంవీ వెబ్‌సైట్‌కు వెళ్లి రూ.2 వేలు అడ్వాన్స్ రుసుంగా చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కూర్చొని ప్రయాణం చేయవచ్చు. పట్టణాల్లో ప్రయాణినికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పొడవు 9.56 అడుగులు, వెడల్పు 3.79 అడుగులుగా ఉంటుంది. 5.24 అడుగుల ఎత్తులో ఉండే ఈ కారు బరువు 550 కేజీలు. 
 
ఇందులో ఆన్‌బోర్డు నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్యాటరీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే, బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు 4 గంటల సమయం పడుతుంది. ఈ చార్జింగ్ కూడా 15 యాంప్స్ సాకెట్ నుంచి చేసుకునే వెసులుబాటును కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments