Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 31 వరకు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్!

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (05:28 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్ వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో విమానాల రాకపోకల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వచ్చే నెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమా‌నాల రాకపోకలను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
అయితే, కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో డీజీసీఏ ప్ర‌త్యేకంగా అనుమ‌తించిన విమానాలు, కార్గో విమానాలు మాత్రం నడుస్తాయని తెలిపింది. కరోనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ప్రకటించింది. 
 
కరోనా వేళ ప్రయాణాలకు సంబంధించిన ప్ర‌యాణ‌, వీసా ప‌రిమితుల పేరుతో కొత్తగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 26న విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌లో మార్పులు చేస్తున్నామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments