Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఎందుకని?

జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:49 IST)
జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  
 
కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్‌11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత భారం కానున్నాయి.  
 
ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై 17 రకాల వస్తువులపై దిగుమతి సుంకం పెరిగింది. వీటిలో స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్స్‌ - కంపోనెంట్స్‌ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments