Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఎందుకని?

జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:49 IST)
జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  
 
కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్‌11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత భారం కానున్నాయి.  
 
ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై 17 రకాల వస్తువులపై దిగుమతి సుంకం పెరిగింది. వీటిలో స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్స్‌ - కంపోనెంట్స్‌ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments