Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమల ఎగుమతులపై నిషేధం.. తక్షణం అమలులోకి...

Webdunia
శనివారం, 14 మే 2022 (14:26 IST)
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ప్రస్తుతం దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు కూడా గోధుమ పంట ఉత్పత్తిని తగ్గిస్తాయని అంచనా. 
 
దీంతో అప్రమత్తమైన కేంద్రం.. గోధుమ ఎగుమతుల్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టానికి (7.79 శాతం), రిటైల్ ఫుడ్ ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 
అన్ని రకాల గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, రెండు అంశాల్లో మాత్రం మినహాయింపునిచ్చింది. విదేశాలతో ఉన్న ఒప్పందం ప్రకారం, ఆయా దేశాలకు సరఫరా చేసే గోధుమలతోపాటు, ఇప్పటికే రవాణాకు సిద్ధం చేసిన గోధుమలను మాత్రం ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments