Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి

Webdunia
శనివారం, 14 మే 2022 (13:52 IST)
గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరాధ్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

కంటి కురుపునకు చికిత్స కోసం నాలుగు రోజులు క్రితం చిన్నారి జీజీహెచ్‌లో చేరింది. శస్త్ర చికిత్స అనంతరం ఆరాధ్యను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. 
 
కాగా… చిన్నారి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేష్ ఆసుపత్రికి తరలించారు. రమేష్ ఆసుపత్రిలో కూడా ఆరాధ్య వెంటిలేటర్‌కే పరిమితమైంది. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
 
నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య. 12 ఏళ్ల పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. 
 
చిన్నారి ఎదుగుతున్న కొద్ది కణితి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు… దానిని తొలగించేందుకు జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారు. అక్కడ ఆపరేషన్‌కు వెళ్లిన చిన్నారి.. ఆపరేషన్‌కు తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments