సమాధిలో వున్నా, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నా: కైలాసం నుంచి నిత్యానంద స్వామి

Webdunia
శనివారం, 14 మే 2022 (13:50 IST)
వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో నిత్యానంద రాసలీలల వీడియో తెగ వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
అయితే ఆ తర్వాత డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు, అత్యాచార ఆరోపణలు, ఆశ్రమంలో ఏనుగు దంతాలు, పులి చర్మాలు ఇలా రకరకాల కేసుల్లో కటకటాల్లోకి వెళ్లిన నిత్యానంద బయటకు వచ్చి భారత్ వదిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్‌కు పారిపోయాడు. 
 
అక్కడ ఏకంగా తన కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. ఈ నేపథ్యంలో నిత్యానంద స్వామి మరణించారని కొన్ని రోజులుగా పుకార్లు రావడంతో తాను చనిపోలేదని తెలిపాడు. 
 
చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ వార్తలపై నిత్యానంద స్వామి  క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్​బుక్​ పోస్ట్​లో పోస్ట్ చేశాడు. 
 
"ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు" అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: అవాస్తవ, తప్పుదారి పట్టించే వార్తా కథనాన్ని ఖండించిన డి. సురేష్ బాబు

Prabhas Old getup: రాజాసాబ్ లో ప్రభాస్ ను ఓల్డ్ గెటప్ చూపిస్తున్నాం : మారుతీ

వామ్మో.. 'ది రాజాసాబ్‌'కు మరో 8 నిమిషాల సన్నివేశాలు జోడింపా?

ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ తొలి రోజు కలెక్షన్ అంతేనా?

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments