Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగుమతి సుంకాలను తగ్గించిన కేంద్రం.. దిగిరానున్న వంట నూనెలు

Webdunia
బుధవారం, 25 మే 2022 (09:32 IST)
దేశంలో వంట నూనెల ధరలు ఆకాశంలో ఉన్నాయి. వీటి ధరలను చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరగుతున్న యుద్ధం కారణంగా దేశంలో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, ఇంధన ధరలు, వంట నూనెల ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నూనెల దిగుమతిపై వసూలు చేస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ఈ విషయాన్ని మంళవారం ప్రకటించింది. 
 
ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం