Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశ వినియోగదారులను ఆకట్టుకుంటున్న కొత్త ఫోల్డబుల్స్: సామ్‌సంగ్ సీఈఓ జెబి పార్క్

ఐవీఆర్
మంగళవారం, 5 ఆగస్టు 2025 (20:40 IST)
సామ్‌సంగ్ యొక్క ఏడవ తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు-గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, జెడ్ ఫ్లిప్7, జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ- భారతదేశంలో అపూర్వమైన ఆదరణను పొందాయి. ఎంపిక చేసిన మార్కెట్లలో పూర్తిగా స్టాక్ కూడా అయిపొయింది అని కంపెనీ తెలిపింది. జూలై 9, 2025న ఈ ఫోన్స్‌ను విడుదల చేసిన తరువాత మొదటి 48 గంటల్లోనే గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, జెడ్ ఫ్లిప్7, జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ కోసం 2.1 లక్షలకు పైగా ప్రీ-ఆర్డర్‌లను సామ్‌సంగ్ అందుకుంది.
 
అద్భుతమైన అమ్మకాల నేపథ్యంలో, అపూర్వ అవకాశాలు కలిగిన కీలకమైన వ్యూహాత్మక మార్కెట్‌గా భారతదేశం నిలుస్తుందని, సామ్‌సంగ్ యొక్క  ప్రపంచ భవిష్యత్తులో కీలకమైన మార్కెట్ అని సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్ అన్నారు. "మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా భారతదేశం యొక్క వృద్ధి పథం గురించి సామ్‌సంగ్ ఆశాజనకంగా ఉంది. భారతదేశం యొక్క స్వావలంబన ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా అనుగుణంగా, ఆవిష్కరణ, తయారీ, స్థానిక విలువ జోడింపులో పెట్టుబడి పెట్టడంను సామ్‌సంగ్  కొనసాగిస్తోంది" అని పార్క్ చెప్పారు.
 
కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు-గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈలను సామ్‌సంగ్ యొక్క నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి. కొత్త ఫోల్డబుల్‌ల అభివృద్ధిలో బెంగళూరులోని సామ్‌సంగ్ యొక్క ఆర్ &డి కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లు ముఖ్యమైన పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. "భారతదేశం పట్ల సామ్‌సంగ్ యొక్క దీర్ఘకాలిక నిబద్ధత అచంచలంగా ఉంది, ఎందుకంటే మేము మా ప్రపంచ వ్యూహానికి అత్యంత కీలకంగా ఇండియాను చూస్తున్నాము. ఇక్కడ 2 తయారీ ప్లాంట్లు, 3 ఆర్ &డి  కేంద్రాలు మరియు ఒక డిజైన్ కేంద్రం ఉన్నాయి.  స్థానిక డిమాండ్ తో పాటుగా ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తోన్న డిమాండ్ ను  తీర్చడంలో సామ్‌సంగ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది" అని పార్క్ జోడించారు.
 
ఫోల్డబుల్‌లతో సామ్‌సంగ్ యొక్క పరిణామ ప్రయాణంలో, పరికరాలను చిన్నగా చేయడమే అసలైన భావన అని పార్క్ చెప్పారు. "మా దగ్గర 5 అంగుళాల స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పుడు, అది అతిపెద్దది, అత్యంత లీనమయ్యేది అని మేము భావించాము. ఇప్పుడు, స్క్రీన్ పరిమాణం 6.9-అంగుళాలకు పెరిగింది, అది మరింత పెద్దదిగా మారుతోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మీ జేబులోకి వెళ్లవు, వాటిని పట్టుకోవడం కూడా కష్టం. కాబట్టి, మేము ఈ స్మార్ట్ ఫోన్‌ను చిన్నగా ఎలా మార్చవచ్చో ఆలోచించడం ప్రారంభించాము. అప్పుడే మేము దానిని తిప్పాము లేదా మడచటం ప్రారంభించాము. ఇది ఇతర బ్రాండ్‌లు అనుసరించబోయే ట్రెండ్ అని నేను అనుకుంటున్నాను" అని పార్క్ చెప్పారు.
 
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7 పెద్ద డిస్‌ప్లేలతో వస్తాయి. కృత్రిమ మేధస్సు ఫీచర్లను ఆస్వాదించటానికి ఉత్తమ మొబైల్ పరికరాలు అని పార్క్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments