భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కోసం తాము అపూర్వమైన డిమాండ్ను అందుకున్నట్లు నేడు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ స్మార్ట్ఫోన్ 'అవుట్-ఆఫ్-స్టాక్'గా ఉంది. అపూర్వమైన ఈ డిమాండ్ను తీర్చడానికి కంపెనీ నోయిడాలోని దాని తయారీ కర్మాగారంలో అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
సామ్సంగ్ ఇండియా, ఇంతకుముందు తమ ఏడవ తరం ఫోల్డబుల్స్- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7ఎఫ్ఈ - కోసం భారతదేశంలో కేవలం 48 గంటల్లో రికార్డు స్థాయిలో 210,000 ప్రీ-ఆర్డర్లను అందుకున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్, వేగవంతంగా ప్రధాన స్రవంతిలోకి రావడాన్ని సూచిస్తుంది.
“గెలాక్సీ జెడ్ ఫోల్డ్7కు బ్లాక్ బస్టర్ ప్రారంభం ఇచ్చినందుకు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశంలోని అనేక మార్కెట్లు భారీ డిమాండ్ కారణంగా కొరతను ఎదుర్కొంటున్నాయని మాకు తెలుసు. వీలైనంత త్వరగా మా అత్యంత అధునాతన స్మార్ట్ఫోన్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్7ను వినియోగదారులు ఆస్వాదించడానికి వీలుగా తగినంత సరఫరాను నిర్ధారించడానికి మేము ఓవర్ టైం పని చేస్తున్నాము. రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల నుండి బలమైన డిమాండ్ వస్తోంది” అని సామ్సంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఇప్పటివరకు దాని సన్నని, తేలికైన డిజైన్లో, కేవలం 215 గ్రాముల బరువు ఉంటుంది, గెలాక్సీ ఎస్25 అల్ట్రా కంటే కూడా తేలికైనది. ఇది మడతపెట్టినప్పుడు కేవలం 8.9 mm మందం మరియు విప్పినప్పుడు 4.2 mm మందం ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఇప్పుడు బ్లూ షాడో, సిల్వర్ షాడో, మింట్ మరియు జెట్ బ్లాక్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది.
బలమైన డిమాండ్ గురించి, భారతదేశ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్కు కీలక రిటైల్ భాగస్వామి అయిన విజయ్ సేల్స్ డైరెక్టర్ నీలేష్ గుప్తా మాట్లాడుతూ, "సామ్సంగ్ యొక్క ఏడవ తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ముఖ్యంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7కు మా స్టోర్లలో అసాధారణ డిమాండ్ కనిపిస్తోంది. కీలక నగరాల్లోని మా అగ్ర శ్రేణి అవుట్లెట్లలో చాలావరకు ఇప్పటికే స్టాక్ అయిపోయింది. ఈ పరికరం అందించే ఆవిష్కరణ మరియు ప్రీమియం అనుభవంతో కస్టమర్లు ఆశ్చర్యపోతుండటమే కాదు, ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు ప్రధాన స్రవంతిలోకి వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది" అని అన్నారు.
"సామ్సంగ్ యొక్క ఏడవ తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ముఖ్యంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, మా రిటైల్ నెట్వర్క్లో అద్భుతమైన అమ్మకాలను ప్రదర్శిస్తున్నాయి. డిమాండ్ పరంగా పెరుగుదలను మేము గమనిస్తున్నాము, కీలకమైన పట్టణ ప్రాంతాల్లోని మా ఫ్లాగ్షిప్ స్టోర్లలో చాలా వరకు స్టాక్ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఇది ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు బలమైన కస్టమర్ ఆదరణను సూచిస్తుంది, ”అని ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సందీప్ సింగ్ జాలీ అన్నారు. పూర్విక మొబైల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉవరాజ్ నటరాజన్ మాట్లాడుతూ, "గెలాక్సీ జెడ్ ఫోల్డ్7కు అన్ని ప్రాంతాలలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. అపూర్వ విజయాన్ని సాధించింది. మా స్టోర్లకు డెలివరీ అవుతున్న వెంటనే స్టాక్లు లిక్విడేట్ అవుతున్నాయి" అని అన్నారు.