ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీ మరోమారు పొడగింపు!

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (17:57 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కటీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆఖరు తేదీలోను పొడగిస్తూ పోతున్నారు. తాజాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు తేదీని కేంద్రం మరోమారు పొడగించింది. ఇప్పటికే ఆఖరు తేదీ డిసెంబరు 31వ తేదీ వరకు ఉండగా, ఇపుడు మరోమారు పొడగించింది. 
 
కరోనా వైరస్ కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు పన్ను చెల్లింపుదారులు పడుతోన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ)... ఈ గడువును పొడిగించిందని ఆదాయపు పన్ను శాఖట్విట్టరులో వెల్లడించింది. 
 
ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ఫైలింగ్ తేదీ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని ఆర్థికమంత్రిత్వశాఖ పొడిగించడం ఇది రెండోసారి. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటిసారి నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మే నెలలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పొడిగించారు. దీంతో నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేని వారికి కాస్త ఉపశమనం కలిగినట్టు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments