కష్టమర్లకు షాకిచ్చిన ఐసీఐసీ బ్యాంక్... నేటి నుంచే అమలు

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (11:58 IST)
దేశంలోని కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చింది. ఈ బ్యాంకు సేవలకు సంబంధించిన పలు చార్జీలను సవరించింది. ఇవి ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
ఈ కొత్త నిబంధనల మేరకు బ్యాంక్ కస్టమర్లు అదనపు చెక్ బుక్ పొందాలంటే ఫీజు చెల్లించుకోవాలి. ఒక ఏడాదిలో 25 చెక్కులతో కూడిన చెక్ బుక్ ఉచితంగా పొందొచ్చు. ఈ లిమిట్ దాటితే 10 చెక్కులతో కూడిన ప్రతి చెక్ బుక్‌కు రూ.20 చెల్లించుకోవాలి.
 
అలాగే, ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలలో తొలి 4 క్యాష్ విత్‌డ్రాయెల్‌పై ఎలాంటి చార్జీలు ఉండవు. తర్వాత బ్యాంక్ కస్టమర్లు రూ.1000 విత్‌డ్రాపై రూ.5 చార్జీ చెల్లింపుకోవాలి. ప్రతి నెలా రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా పొందొచ్చు. 
 
లిమిట్ దాటితే గరిష్టంగా రూ.150 వరకు చార్జీ పడుతుంది. హోమ్ బ్రాంచ్‌కు ఈ చార్జీలు వర్తిస్తాయి. అదే నాన్ హోమ్ బ్రాంచ్‌లో అయితే రోజుకు రూ.25 వేల వరకు తీసుకోవచ్చు. చార్జీలు ఉండవు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న చార్జీలే పడతాయి.
 
బ్యాంక్ కస్టమర్లు నెలలో తొలి మూడు లావాదేవీలు (నాన్ బ్యాంక్ ఏటీఎం) చార్జీలు లేకుండా పొందొచ్చు. మెట్రో నగరాలకు ఇది వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8.5 చెల్లించుకోవాలి. ఇతర ప్రాంతాల్లో అయితే 5 లావాదేవీలు నిర్వహించొచ్చు. చార్జీలు పడవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments