Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ రాయితీలో భారీగా కోత... ఇకపై భారం తప్పదా?

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (09:21 IST)
ప్రజలకు ఇచ్చే వంటగ్యాస్‌ నగదు రాయితీకి కేంద్రం భారీగా కోత పెట్టింది. 2019-20లో దీని కింద రూ.24,172 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 2021-22 నాటికి ఎకాఎకి రూ.242 కోట్లకు తగ్గించిపారేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి సోమవారం రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
2019 ఏప్రిల్‌ ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.706.50 ఉండగా, ఆదివారం నాటికి రూ.1,053కి (49 శాతం పెంపు) చేరింది. సిలిండర్‌ ధరలకు ఆధారమైన 'సౌదీ కాంట్రాక్ట్‌ ప్రైస్‌' ఇదే సమయంలో టన్నుకు 508 డాలర్ల నుంచి 750 డాలర్లకు (47 శాతం) పెరిగింది.
 
గత మూడేళ్లలో సబ్సిడీ తగ్గిన తీరును ఓ సారి పరిశీలిస్తే, ప్రత్యక్ష నగదు బదిలీ కింద గత 2019-20లో 22,726 కోట్లను బదిలీ చేయగా, ఇది 2020-21లో  రూ.3658 కోట్లకు, 2021-22లో రూ.242 కోట్లకు తగ్గించారు. 
 
అలాగే, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గత 2019-20లో రూ.1446 కోట్లు, 2020-21లో రూ.76, 2021-22లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అలాగే పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద గత 2020-21లో రూ.8162 కోట్లను కేటాయించి, 2021-22లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments