కేంద్రం గుడ్‌ న్యూస్‌... త్వరలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:52 IST)
వాహనాదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్‌ వరకు ప్రయాణించిన వరకే టోల్‌ చార్జీలను ఇందులో చెల్లించవచ్చనని చెప్పారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టవచ్చన్నారు.
 
జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్ల కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని వల్ల ప్రతి ఏటా రూ.20 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ.10 వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని మంత్రి వివరించారు.
 
టోల్‌ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను సోమవారం (మార్చి 1,2021) మంత్రి ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్‌ వ్యవస్థను విడుదల చేశారు. ఈ ఏడాది(2021) ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
 
టోల్‌ ప్లాజాల దగ్గర జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. టోల్‌ ప్లాజాలను ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయపన్ను, జీఎస్‌టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందన్నారు. 
 
జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్టు మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

Virosh: కొత్త లైఫ్ ను స్టార్ చేస్తున్నాం.. ఆశీర్వదించండి : రష్మిక మందన్న

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments