Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో ప్రజలకు ఊరట .. వంట నూనెల ధరలు తగ్గింపు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (19:14 IST)
దేశంలో వంటనూనెల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో సగటు జీవి ఈ ధరల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతున్నాడు. దీనికితోడు ఇతర కిరాణా  సరకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. రిఫైన్డ్ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఇప్పటివరకు 32.5 శాతం ఉండగా, ఇప్పుడది 17.5 శాతానికి తగ్గించింది. 
 
అలాగే, పామాయిల్‌పై అగ్రిసెస్ 7.5 శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ 5.5 శాతానికి తగ్గింది. ఈ ఎత్తివేత, తగ్గింపులు అక్టోబరు 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. తదుపరి మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
 
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వంట నూనెల ధరలు బాగా తగ్గనున్నాయి. దేశంలో దసరా, దీపావళి సీజన్‌ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు కాస్త ఊరట కలిగించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments