Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరకు కేంద్రం చికిత్స.. ఎగుమతులపై నిషేధం

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (17:19 IST)
దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని తాకివుంది. దీంతో ఉల్లిని కోయకముందే కన్నీరు వస్తోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడమే. దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80కి పైగా పలుకుతోంది. పైగా నాణ్యత కూడా నాసిరకంగా ఉంటోంది. 
 
ఈ నేపథ్యంలో, కేంద్రం కాస్త కఠిన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
అంతేకాకుండా, పౌరులు కావాలనే ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్రం భావిస్తోంది. ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు తామే ఉల్లిని తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నాయి. ఢిల్లీలో కిలో రూ.25, పంజాబ్‌లో కిలో రూ.35 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 కిలోలు మాత్రమే అమ్ముతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments